ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలి

ఏపీలో ఉన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకోవాలి

హైదరాబాద్, వెలుగు: ఏపీ విభజన తర్వాత ఎందరో తెలంగాణ బిడ్డలు ఏపీలో జాబ్స్ చేస్తూ తమ కుటుంబాలకు దూరంగా అత్యం త దయనీయ స్థితిలో బాధపడుతున్నారని ఎక్సైజ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం ఈ మేరకు కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఏపీ నుంచి వచ్చేందుకు రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్ల నుంచి దాదాపు 1,800 మంది అప్లై చేసుకున్నారని, అందులో నిజమైన తెలంగాణవాసులు 636 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. వారందరినీ వెనక్కి తీసుకురావాలని కోరారు. అక్రమంగా వచ్చినోళ్లను వెనక్కి పంపాలని డిమాండ్ చేశారు.