V6 News

కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పాటు : తలసాని శ్రీనివాస్ యాదవ్

కేసీఆర్ వల్లే తెలంగాణ ఏర్పాటు : తలసాని శ్రీనివాస్ యాదవ్

పద్మారావునగర్, వెలుగు: బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

దీక్షా దివస్​ను పురస్కరించుకుని మంగళవారం నిమ్స్ హాస్పిటల్ లో ఆయన పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. కేసీఆర్​ అన్ని వర్గాలను ఏకం చేసి తెలంగాణ సిద్ధించేలా కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, బీఆర్​ఎస్​ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, నాయకులు మాగంటి సునీత, విప్లవ్ కుమార్, మేడె రాజీవ్ సాగర్, మన్నె గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

కంటోన్మెంట్​లో..

విజయ్ దివస్ సందర్భంగా కంటోన్మెంట్ అన్నానగర్, బోయిన్​పల్లిలో తెలంగాణ తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహాలకు బీఆర్​ఎస్​ నాయకులు పూలమాలలు వేశారు. బేవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేశ్​, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి  పాల్గొన్నారు.