
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర పన్నుల్లో వాటా (స్టేట్స్ డివల్యూషన్ ఫండ్స్) కింద తెలంగాణకు రూ.1,533.64 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు/యూటీలకు కలిపి రూ.72,961.21 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయల అభివృద్ధికి ఈ ఫండ్స్ ఉపయోగపడతాయని పేర్కొంది.
ఈ నెల 11న రిలీజ్ చేసిన నిధులకు, వచ్చే ఏడాది జనవరి 10న రాష్ట్రాలకు చెల్లించాల్సిన పన్ను పంపిణీకి ఈ ఫండ్స్ అదనం అని స్పష్టం చేసింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.13,088 కోట్లు, బీహార్కు రూ.7,338.44 కోట్లు, మధ్యప్రదేశ్కు రూ.5,727 కోట్లు, పశ్చిమ బెంగాల్కు రూ.5,488.88 కోట్లు, మహారాష్ట్రకు రూ.4,608.96 కోట్లు, తమిళనాడుకు రూ. 2,976.10 కోట్లు, ఏపీ రూ.2,952.74 కోట్లు, కర్నాటకకు రూ. 2,660.88 కోట్లు, గుజరాత్కు రూ.2,537 కోట్లు రిలీజ్ చేసింది.