
హైదరాబాద్, వెలుగు: తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీకి ఎన్వోసీ ఇవ్వాలని చత్తీస్గఢ్ను తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ మంగళవారం చత్తీస్గఢ్ఇరిగేషన్ సెక్రటరీ అంబగలన్తో ఫోన్లో మాట్లాడారు.
తుపాకులగూడెంలో 80 మీటర్ల దాకా నీటిని నిల్వ చేసినా చత్తీస్గఢ్లో ఎలాంటి ముంపు తలెత్తదని ఇటీవల టెక్నికల్ ఆఫీసర్ల ఫీల్డ్ విజిట్లోనూ నిర్ధారణ అయ్యిందని గుర్తు చేశారు. టెక్నికల్ఆఫీసర్సూచనల మేరకు బ్యారేజీలో 80 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు నో అబ్జక్షన్సర్టిఫికెట్ఇవ్వాలని చత్తీస్గఢ్ సర్కార్ను కోరారు. 83 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తేనే చత్తీస్గఢ్లో ముంపు ఉంటుందని తెలిపారు.
బ్యారేజీ నిర్మాణం పూర్తయినందున ఈ సీజన్నుంచే నీటిని నిల్వ చేయాల్సి ఉందని వివరించారు. చత్తీస్గఢ్ ప్రభుత్వం ఎన్వోసీ ఇస్తే నీటి నిల్వకు సీడబ్ల్యూసీ క్లియరెన్స్ఇస్తుందని వివరించారు.