భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీ చేసింది. ధార్మిక అడ్వైజర్ గోవింద్ హరీ కన్వీనర్ గా నియామకం కాగా భద్రాచలం ఈవో దామోదర్రావు, భద్రాద్రి కొత్తగూడెం ఆర్అండ్బీ ఎస్ఈ లాల్సింగ్, దేవస్థాన ఈఈ రవీందర్రాజు, స్థపతి వల్లీనాయగన్, ప్రధానార్చకులు అమరవాది విజయరాఘవన్, స్థానాచార్యులు స్థల సాయి, ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి, కాంట్రాక్టర్వై.రామకృష్ణారెడ్డిలను సభ్యులుగా నియమించారు. రూ.351 కోట్లతో ప్రారంభమైన అభివృద్ధి పనులను ఈ కమిటీ పర్యవేక్షించనుంది.
