బీబీనగర్ ఎయిమ్స్ 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించనున్న వైట్ కోర్ట్ వేడుకలకు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ హాజరయ్యారు. గవర్నర్కు ఎయిమ్స్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రావాలన్నారు. తన భర్త నెఫ్రాలజిస్ట్ , తాను గైనకాలజిస్ట్ ని, అల్ట్రా సౌండ్ లో మంచి అనుభవం ఉందని తమిళిసై తెలిపారు.
ఐరన్ మాత్రలు వేసుకుంటే మంచిది కానీ.. పుట్టే పిల్లలు నల్లగా అవుతారని ఐరన్ మాత్రలు గర్భిణులు పడేస్తున్నారన్నారు. కానీ ఐరన్ మాత్రలు గర్భిణులు వేసుకుంటే పుట్టే పిల్లలు బలంగా పుడతారన్నారు. ఇలాంటి వాళ్ళకు అవగాహన కల్పించాలన్నారు. ఫెటల్ థెరపీ నేర్చుకోవడం కోసం తానుకెనడా వెళ్ళానని తెలిపారు. డిజబుల్ పిల్లలకు ఇది ఉపయోగపడుతుందన్నారు గవర్నర్ తమిళిసై. నేర్చుకునేది ఏదైనా సిన్సియర్ గా నేర్చుకోవాలని పిల్లలకు సూచించారు. ముఖ్యంగా రోగ లక్షణాల గురించి ఎక్కువ నేర్చుకోవాలని తెలిపారు. విద్య వృత్తిని ఎంజాయ్ చేస్తూ నేర్చుకోవాలన్నారు. వృత్తి ని ఎంజాయ్ చేయాలన్నారు.
విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాస్ లు నిర్వహించినందుకు ఎయిమ్స్ సిబ్బందిని ఆమె అభినందించారు.
మెడికల్ ఎడ్యుకేషన్కు కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం అమలులో ఉందన్నారు. ఇది పెద్ద ఇన్సూరెన్స్ ప్రోగ్రామన్నారు తమిళిసై. పాండిచ్చేరికి కూడా తాను గవర్నర్గా పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. అత్యంత తక్కువ వయసులో తాను గవర్నర్ అయ్యానన్నారు తమిళిసై.