తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్తో నడిచిన ఉద్యమకారులకు సముచిత గౌరవం దక్కుతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం సీఎం కేసీఆర్ కల్పించారని చెప్పారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకొని అభివృద్ధి వైపు వెళ్తున్నామన్నారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఈడిగ ఆంజనేయ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కవిత ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
రాష్ట్రం ఏర్పడ్డాక క్రీడాకారులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని కవిత అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మించుకుంటున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా క్రీడాకారులకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసేలా ప్రభుత్వం పని చేస్తోందని వెల్లడించారు.