త్వరలోనే గురుకులాల టైమింగ్స్ మార్పు..ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వెల్లడి

త్వరలోనే గురుకులాల టైమింగ్స్ మార్పు..ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వెల్లడి

 హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల పనివేళల్లో మార్పునకు ప్రభుత్వం అంగీకరించిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నట్టు చెప్పారు. సోమవారం ఆయన సెక్రటేరియెట్ లో సీఎంఓ సెక్రటరీలు అజిత్ రెడ్డి, వేముల శ్రీనివాస్ లను పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, దామోదర్ రెడ్డితో పాటు కలిసి వినతిపత్రం అందించారు. గురుకులాల్లో విద్యార్థులు, టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. గురుకుల టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్లందరికీ ప్రమోషన్లు ఇవాలని శ్రీపాల్ రెడ్డి కోరారు.