గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల

గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల

తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి11న నిర్వహించారు. ఈ పరీక్షకు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శుక్రవారం (ఏప్రిల్ 19) గురుకుల ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://tgcet.cgg.gov.in వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన ఉంటుంది.  

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం వివిధ గురుకుల విద్యా సంస్థలలో ప్రవేశం కొరకు ప్రతి ఏటా TGCET ని నిర్వహిస్తుంది. ఈ సంస్థలు అధిక నాణ్యత గల విద్యను అందించి విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికి తోడ్పడుతున్నాయి. ఫలితాల ప్రకటన తర్వాత అడ్మిషన్ల ప్రాసెస్ కు సంబంధించిన అప్ డేట్ ల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్  https://tgcet.cgg.gov.in ను చెక్ చేసుకోవాలి. మరిన్ని వివరాలకో TGCET హెల్ప్ డెస్క్ ని  సంప్రదించవచ్చు.