టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. డ్రగ్స్ కేసుపై 2017లో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు విచారణ చేసింది.రాష్ట్ర ప్రభుత్వం ఈడీకి సహకరించడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది రచనరెడ్డి తన వాదనలు వినిపించారు. కీలక వ్యక్తుల ప్రమేయం ఉన్న కేసులో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సరిగా లేదని రచనా రెడ్డి పేర్కొన్నారు. ఆన్ లైన్ విచారణలో నేరుగా కోర్టుకు ఈడీ జేడీ అభిషేక్ గోయెల్ వివరించారు. డ్రగ్స్ కేసులో డాక్యుమెంట్లు, వివరాలను ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఈడీ అడుగుతున్న డాక్యుమెంట్లు ఎక్సైజ్ శాఖ తమకు ఇవ్వడం లేదని కోర్టు చెబుతోందని జేడీ పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న సమాచారమంతా ఈడీకి, కోర్టులకు ప్రభుత్వ ప్రత్యేక జీపీ తెలిపారు. దీంతో ఎఫ్ఐఆర్ లు, ఇతర పూర్తి వివరాలు ఈడీకి అప్పగించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. 

దర్యాప్తు అధికారులు సమర్పించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని విచారణ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని విచారణ కోర్టులకు హైకోర్టు తెలిపింది. డ్రగ్స్ కేసుకు సంబంధించిన వారి కాల్ డేటా రికార్డులను నెల రోజుల్లో ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది. డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి పిల్ పై విచారణను హైకోర్టు ముగించింది. సీబీఐ, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. తమ ఆదేశాలను అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరించింది. వివరాలు సమర్పించకపోతే తమను సంప్రదించవచ్చునని ఈడీకి హైకోర్టు సూచించింది. మాదకద్రవ్యాలు యువతపై తీవ్రం ప్రభావం చూపుతున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. దేశ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈడీ దర్యాప్తునకు సహకరించాలన్న న్యాయస్థానం పేర్కొంది. 

ఇవి కూడా చదవండి:

తెలంగాణ హైకోర్టుకు 12మంది కొత్త జడ్జిలు

టీచర్ పోస్టులను భర్తీ చేయండి