నేడు ఇంటర్ రిజల్ట్

నేడు ఇంటర్ రిజల్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మంగళవారం ఇంటర్​ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసులో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిలీజ్ చేయనున్నారు. ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్​ను ఒకేసారి విడు దల చేయనున్నారు.

కాగా, మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ ఎగ్జామ్స్ జరిగాయి. పరీక్షలకు మొత్తం 9.47 లక్షల మంది అటెండ్ కాగా, వీరిలో ఫస్టియర్ స్టూడెంట్లు 4.82 లక్షలు, సెకండియర్ స్టూడెంట్లు 4.65 లక్షల మంది ఉన్నారు. ఫలితాలను https://tsbie.cgg.gov.in , results.cgg.gov.inలో  చూడొచ్చన్నారు. కాగా, రెండు మూడు రోజుల్లోనే టెన్త్ ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు రెడీ అయ్యారు.