అభివృద్ధిని చూసి ఓటేయండి : మంత్రి మల్లారెడ్డి

అభివృద్ధిని చూసి ఓటేయండి : మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని.. సంక్షేమ పథకాలు చూసి మళ్లీ కేసీఆర్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి మల్లారెడ్డి. 2023, నవంబర్ 24వ తేదీ.. ఆయన మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర మండలంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని.. అంతే కాకుండా రోడ్లు, కరెంట్, డ్రైనేజ్ వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని ప్రజలకు వివరించారాయన. 

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. హైదరాబాద్ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని.. ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధిని చూసి ఓటేసి గెలిపించాలని విన్నవించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ వైపు గాలి వీస్తుందని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతున్నారంటూ జోస్యం చెప్పారు మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాంలు అని.. ఎవరూ ఆరు గ్యారెంటీలను నమ్మొద్దని కోరారాయన. రాబోయే రోజులలో మరింతగా ప్రజలకు సేవ చేస్తామంటూ తనదైన స్టయిల్ లో ఓటర్లను అభ్యర్థించారు మల్లారెడ్డి.