ఖైరతాబాద్, వెలుగు: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ– డి నుంచి బీసీ– ఎ లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఖైరతాబాద్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, అధ్యయన వేదిక చైర్మన్ప్రొఫెసర్రాములు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజ్అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కుల గణన చేసి తమకు దక్కాల్సిన రాజకీయ పదవులను ఇవ్వాలని కోరారు. మెదక్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, బోదరబోయిన యాదగిరి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దమ్మిగారి కనకయ్య, కార్యదర్శి నీలం దుర్గేశ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముందుల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
