వచ్చే నెల 5 నుంచి కొత్త జడ్పీల పాలన

వచ్చే నెల 5 నుంచి కొత్త జడ్పీల పాలన

వచ్చే నెల 5వ తేదీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లు మనుగడలోకి రానున్నాయి. రా ష్ట్రంలో 32 జిల్లా పరిషత్ లు ఉండగా ఖమ్మం , కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జడ్పీల పదవీకాలం ఆగస్టు 5 వరకూ ఉంది. మిగతా 28 జడ్పీల ప్రారంభానికి మరో 15
రోజులే సమయం ఉంది. అయితే ఇప్పటి వరకూ జడ్పీ ఉద్యోగుల విభజనకు సంబంధించి గైడ్ లైన్స్ విడుదల కాలేదు. విభజనకు సంబంధించి ఆప్షన్లు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల విభజనతో పాటు ఆస్తులు, నిధుల విభజనపై వారంలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఆర్థిక శాఖకు ఫైలు
ప్రస్తుతం 9 జడ్పీల్లో 500 మంది పనిచేస్తున్నారు. వీరిలో డ్రైవర్ల నుంచి సూ పరింటెం డెంట్ల వరకూ ఉన్నారు. అకౌంటెంట్లు , డిప్యూటీ సీ ఈవోలు, సీ ఈవోలు అదనంగా ఉన్నారు. మరో 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సి బ్బం దినే 32
జడ్పీలకు సర్దుబాటు చే యనున్నట్లు పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. ఉద్యోగుల విభజనపై క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు ఫైల్ పంపినట్లు తెలుస్తోం ది. క్లియరెన్స్ రా గానే విభజన ప్రక్రియ ప్రారంభిం చనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జులై 3న ఉద్యోగులు విధుల్లో చేరేలా వారంలో ప్రక్రియ పూర్తి చేయటానికి కసరత్తు చేస్తున్నారు.

కొలిక్కి వచ్చిన భవనాలు
ప్రస్తుతం ఉన్న 9 జడ్పీ లకు సొంత భవనాలు ఉండగా, కొత్తగా ఏర్పాటైన 23 జిల్లాల్లో జడ్పీ కార్యాలయాల ఏర్పాటుకు భవనాల ఎంపిక చివరిదశకు చేరిందని పంచాయతీ రాజ్ అధికారులు చెబుతున్నారు. అన్ని చోట్ల ప్రభుత్వ భవనాల్లో నే జడ్పీ ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొంత కాలం తర్వాత భ వనాల నిర్మాణం చే పట్టాలని నిర్ణయిం చినట్లు సమాచారం.