- తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కోరింది. శనివారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డిని ఫెడరేషన్ చైర్మన్ బాలకృష్ణ, సెక్రటరీ జనరల్ జీవన్ కలిసి వినతపత్రం అందజేశారు. పదేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు చతికిలపడ్డాయని, వాటి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వెంటనే వాటిపై రివ్యూ చేయాలని సీఎంను కోరారు.
కార్పొరేషన్లలో చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయినందున రిక్రూట్మెంట్ చేపట్టాలన్నారు. పబ్లిక్ సెక్టార్ సంస్థల్లోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పే స్కేల్ను రివైజ్ చేయాలన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల విభజన జరగలేదని, వాటి విభజనకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పీఆర్సీ ఏర్పాటు చేసి అమలు చేసేందుకు ఆదేశాలివ్వాలని సీఎంను కోరారు.