- రిలీజ్ చేసిన ప్రభుత్వం
- ఏపీ అకౌంట్లో జమ చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.695 కోట్లు రిలీజ్చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కరెంట్అకౌంట్లో జమ చేయాలని ఆదేశించింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్ల రుణాల తిరిగి చెల్లింపు పథకం కింద టీజీపీఎఫ్సీఎల్ వాటాపై ప్రిన్సిపల్, వడ్డీ ఖర్చుల చెల్లింపు కోసం ఈ మొత్తం డబ్బులను వెచ్చించాల్సిందిగా విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇంధన శాఖ ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఈ మొత్తాన్ని ‘ఆంధ్రప్రదేశ్పవర్ఫైనాన్స్ కార్పొరేషన్లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఎస్ బీఐ కరెంట్ ఖాతాలో జమచేయాలని ఆదేశించారు. మంజూరు చేసిన మొత్తానికి టీజీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ యుటిలైజేషన్ సర్టిఫికేట్ను సమర్పించాలని కోరారు.
