వరి ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కిరికిరి

వరి ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కిరికిరి

ఏడేండ్లుగా సీఎం కేసీఆర్ రైతుల్ని మోసం చేస్తున్నారంటూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. వరి ధాన్యం కొనమంటే కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని అన్నారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎంత మంతమందికి దళిత బంధు ఇచ్చారో చెప్పాలన్నారు. దళితులకు మూడేకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు.మహబూబ్ నగర్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.

మరిన్ని వార్తల కోసం..

ప్రాణహిత పుష్కరాలకు నిధులెందుకు ఇవ్వలేదు ..?

ముంబయిలో సడలని ఉద్రిక్తత