హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం 3 నెలల్లో రాష్ట్ర ఖజానాకు మొత్తంగా రూ.50,910 కోట్లు సమకూరింది. ఇందులో దాదాపు రూ.35 వేల కోట్లు టాక్స్ అండ్ నాన్ టాక్స్ రెవెన్యూ కాగా.. మిగతా మొత్తం అప్పుల రూపంలో తీసుకున్నది. మూడు నెలల్లో ఏప్రిల్, మే, జూన్లలో రూ.15,885 కోట్లు అప్పు చేసినట్లు కాగ్ తాజా రిపోర్ట్లో వెల్లడించింది.
దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పన్ను ఆదాయంలో జీఎస్టీతో రూ.11,418 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్లో రూ.3,510 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.7,532 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.2,988 కోట్లు, ఇతర పన్నులు డ్యూటీలతో రూ.1,868 కోట్లు, నాన్ టాక్స్ రెవెన్యూ రూ.1,488 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కింద రూ.1,811 కోట్లు వచ్చింది.