
న్యూఢిల్లీ, వెలుగు: ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఆ రెండు దేశాల నుంచి తెలంగాణ వాసులు, విద్యార్థులు స్వదేశానికి చేరుకుంటున్నారు. తొలి దశలో సోమవారం ఆరుగురు విద్యార్థులు క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారని అక్కడి తెలంగాణ భవన్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి తిరిగి వచ్చే తెలంగాణ పౌరులకు పూర్తి సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఇరాన్ నుంచి నలుగురు, ఇజ్రాయెల్ నుంచి ఇద్దరు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన వాళ్లందరూ ముందుగానే హైదరాబాద్కు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోగా.. ఢిల్లీలో వారికి కావాల్సిన సహకారాన్ని తెలంగాణ భవన్ సిబ్బంది అందించిందన్నారు. మరో ఏడుగురు తెలంగాణ పౌరులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్లోని అమ్మాన్కు సురక్షితంగా చేరుకున్నారని, వారు త్వరలో ఢిల్లీకి చేరుకుంటారని వెల్లడించారు.