
- జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో అట్లనే రాయాలి
- ‘టీజీ’ కోడ్తోనే వెహికల్స్రిజిస్ట్రేషన్లు
- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకున్నది. వెహికల్స్ రిజిస్ట్రేషన్లు టీజీ కోడ్తోనే చేయాలని ఆదేశాలు జారీచేసింది. వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని ‘టీజీ’గా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అధికారిక సమాచారాల్లో అంతటా ‘టీజీ’గా ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్లలో ‘టీజీ’గానే పేర్కొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అధికారిక సమాచారాల్లో ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్ విభాగాలన్నీ ‘టీజీ’గా ప్రస్తావించాలని, దీనిని వెంటనే అమలు చేయాలని ఆదేశించారు.
టీఎస్ స్థానంలో టీజీగా మార్చాలి
గవర్నమెంట్ఆఫీసుల బోర్డులు, వెబ్సైట్లు, ఆన్లైన్ ప్లాట్ ఫామ్లలోనూ ‘టీజీ’ ఉండాలని ఉత్తర్వుల్లో సర్కారు పేర్కొన్నది. ‘టీఎస్’ అని గతంలో ప్రింట్ చేసిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్ను సైతం తొలగించాలని, వాటి స్థానంలో ‘టీజీ’తో కొత్తగా ముద్రిం చాలని స్పష్టం చేసింది. ఈ నెల 31నాటికి జనరల్అడ్మినిస్ట్రేషన్ శాఖకు నివేదిక ఇవ్వా లని అన్ని శాఖల సెక్రటరీలను సీఎస్ ఆదేశిం చారు. తెలంగాణ ఉద్యమకాలంలో ప్రజలు తెలంగాణను సంక్షిప్తంగా ‘టీజీ’ అని ఉపయోగించారు. తమ వెహికల్స్పై నాడు ఏపీకి బదులు ‘టీజీ’ అని రాసుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభు త్వం తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’గా మార్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడు ‘టీజీ’గా మార్చాలని నిర్ణయం తీసుకున్నది.