తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బుధ, గురువారాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే చాన్స్ ఉందని పేర్కొంది. నిన్న (మంగళవారం) తూర్పు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు ఉన్న ఉపరితల ద్రోణి.. ఈ రోజు (బుధవారం) ఛత్తీస్ గడ్ నుంచి కోస్తా ఆంధ్రా తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని తెలిపింది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో వడగాల్పులు అక్కడక్కడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇ క ఈరోజు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.