మీ కొడుకు లెక్క ఆశీర్వదించండి : గడ్డం వంశీకృష్ణ

మీ కొడుకు లెక్క ఆశీర్వదించండి : గడ్డం వంశీకృష్ణ

ఒక సర్పంచ్ స్థాయి నుంచి స్పీకర్ గా ఎదిగిన నేత శ్రీపాదరావు అని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. వారి ఆశయాలను కొనసాగించాలని తండ్రి బాటలో శ్రీధర్ బాబు ప్రజల కోసం ప్రజా సేవకుడికిగా పనిచేస్తున్నారని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మంథని రోల్ మోడల్ గా నిలిచారని అన్నారు. మారు మూల గ్రామాలను ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. 

మంథనిలోని ఓ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు 25వ వర్ధంతిని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ కృష్ణ మాట్లాడుతూ పెన్షన్ స్కీం, రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని తెలిపారు. మంథని ప్రాంతం మారు మూల ప్రాంతమని ఇక్కడ విద్య అందించాలని శ్రీధర్ బాబు కాలేజ్ లు నిర్మించి రోడ్లు వేయించారని తెలిపారు. 

శ్రీధర్ బాబు ఎంతో కష్టపడి ఈ ప్రాంతానికి సాగు నీళ్లు అందించారని చెప్పారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని కేంద్రం లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే తెలంగాణ మరింత అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మీ బిడ్డలా ఆశీర్వదించి ఒక్కసారి గెలిపించండిని గడ్డం వంశీకృష్ణ కోరారు.