
హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. బుధవారం మరో మూడు పతకాల గెలిచారు. స్విమ్మర్లు సుహాస్ ప్రీతమ్, శ్రీ నిత్యసాగి తమ రెండో పతకం నెగ్గారు. బీహార్ లోని గయాలో జరిగిన మెన్స్ 50 మీటర్ల బ్యాక్స్ట్రోక్ ఈవెంట్లో సుహాస్ 27.68 సెకండ్ల టైమింగ్తో రెండో స్థానంతో రజతం గెలిచాడు. విమెన్స్ 400 మీటర్ల మిడ్లేలో నిత్య సాగి 5 నిమిషాల 20.81 సెకండతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. సైక్లిస్ట్ తనీష్ 200 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించాడు.