- బస్తీ దవాఖానలు, పీహెచ్సీ లను ఆస్పత్రికి కనెక్ట్
పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో త్వరలో టెలి మెడిసిన్సేవలు షురూ కానున్నట్టు సూపరింటెండెంట్ డా.రాజారావు తెలిపారు. ఇందుకు టాటా ట్రస్ట్ఆర్గనైజర్స్ సీఎస్ఆర్ ( కార్పొరేట్సోషల్రెస్పాన్సిబిలిటీ ) కింద సాఫ్ట్వేర్, హార్ట్వేర్ను అందించినట్టు పేర్కొన్నారు. బుధవారం టెలి మెడిసిన్సేవలపై దవాఖానలోని అన్ని డిపార్ట్మెంట్ల ఆర్ఎంవోలు, హెచ్ వోడీలు, సీఎస్ఆర్ఎంవో –1, అడ్మినిస్ర్టేషన్అధికారులు, అసిస్టెంట్ప్రొఫెసర్లు, డాక్టర్లకు ఓరియెంటేషన్ లైవ్ డెమోను సెమినార్హాల్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్లు, హబ్ కో ఆర్డినేటర్లకు ట్రైనింగ్ఇచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్మాట్లాడుతూ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు గాంధీలో టెలి మెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఇక నుంచి బస్తీ దవాఖానలు, పీహెచ్సీ ల నుంచి ఆన్లైన్ ద్వారా పేషెంట్లు గాంధీ డాక్టర్లను కాంటాక్ట్ అయి మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్, గైనకాలజీ, ఈఎన్టీ, ఆప్తామాలజీ, ఆర్ధోపెడిక్, డీవీఎల్, ఫిజియోథెరఫీల్లో డాక్టర్ల నుంచి సలహాలు, ట్రీట్మెంట్గురించి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.