
డిజిటల్ రైట్స్ పై తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం
4 వారాల గడువును 8 వారాలకు పెంచిన ప్రొడ్యూసర్స్
సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ పై కొత్త నిర్ణయం తీసుకుంది టాలీవుడ్ నిర్మాతల మండలి. గతంలో తాము నిర్దేశించిన రూల్స్ ను తాజా పరిస్థితులకు అనుగుణంగా సవరించింది. సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త సినిమా విడుదలైన 4 వారాల్లో టీవీ, వెబ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం చేసుకునేందుకు అవకాశం ఉండేది. ఐతే… ఈ నిర్ణయంతో పలు సందర్భాల్లో నష్టపోతున్నట్టు నిర్మాతలు గుర్తించారు. థియేటర్లలో బాగా రన్ అవుతున్న సినిమా.. 4 వారాల్లోనే వెబ్ లో స్ట్రీమింగ్ అయ్యేసరికి లాస్ జరుగుతున్నట్టు అంచనాకు వచ్చారు. దీంతో.. రూల్స్ మార్చారు.
ఇకనుంచి… రిలీజైన తర్వాత హిట్టు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా థియేటర్లలో ప్రదర్శించే సినిమాకు 8 వారాల లాక్ పీరియడ్ ను నిర్దేశించింది నిర్మాతల మండలి. ఆ సమయం గడిచిన తర్వాతే శాటిలైట్- డిజిటల్ రైట్స్ ఆ సంస్థలకు దక్కుతాయి. మూవీ విడుదలైన 56 రోజులకు ముందు టీవీలోగానీ… వెబ్ లో గానీ ఆ సినిమాను స్ట్రీమింగ్ చేయకూడదని నిర్మాత సురేష్ బాబు చెప్పారు.