వీహెచ్​పీ చలో ఓల్డ్ సిటీ ఉద్రిక్తం

వీహెచ్​పీ చలో ఓల్డ్ సిటీ ఉద్రిక్తం

బషీర్​బాగ్, వెలుగు: విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ఆపరేషన్ గోమాత ఉద్రిక్తతకు దారి తీసింది. గోవులను రహదారులపై అమ్మకానికి పెట్టడాన్ని నిరసిస్తూ వీహెచ్ పీ సోమవారం చలో ఓల్డ్ సిటీకి పిలుపునిచ్చింది. కోఠిలోని వీహెచ్​పీ కార్యాలయం నుంచి నాయకులు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో  పోలీసులు అడ్డుకున్నారు. భారీగా మోహరించి బారికేడ్లు పెట్టి నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులకు నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో నాయకులను బలవంతంగా అరెస్ట్ చేశారు. హిందువులు పవిత్రంగా పూజించే గోవులను బక్రీద్ సందర్భంగా హత్య చేయడాన్ని తీవ్ర ఖండిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ నాయకులు ప్రకటించారు. చట్టప్రకారం గోవులను కాపాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. మజ్లీస్ నేతల అండదండలతో జరుగుతున్న ఈ గోహత్యలను ప్రభుత్వం నివారించాలని, లేకపోతే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.