
- అరెస్టు చేసి పీఎస్కు తరలించిన పోలీసులు
- భారీగా మోహరింపు
భైంసా/బాసర, వెలుగు : నిర్మల్జిల్లా బాసర ట్రిపుల్ఐటీ కాలేజీ పోలీసు పహారాలో ఉంది. రెండు రోజుల కింద పీయూసీ-1 చదువుతున్న జాదవ్ బబ్లూ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బుధవారం క్యాంపస్దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనను నిరసిస్తూ టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో యూనివర్సిటీని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ బాసర ట్రిపుల్ ఐటీ ఆత్మహత్యలకు కేరాఫ్గా మారిందన్నారు. ఏడాదిలో ఐదుగురు ఆత్మహత్యలు చేసుకున్నారని, కేసీఆర్సర్కారు స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై సిట్టింగ్హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తర్వాత కాంగ్రెస్ ముథోల్నియోజకవర్గ ఇన్చార్జి ఆనంద్రావు పటేల్, లీడర్లు సైతం క్యాంపస్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా.. వారిని కూడా అరెస్టు చేసి పీఎస్కు తీసుకువెళ్లారు. ఆర్జీయూకేటీ మెయిన్గేటు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. సజెషన్స్ బాక్సులు ఏర్పాటు చేస్తాం కాలేజీలో స్టూడెంట్స్ఆత్మహత్యలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని వీసీ వెంకట రమణ తెలిపారు. మంగళవారం జాదవ్ బబ్లూ అనే స్టూడెంట్ఆత్మహత్య చేసుకోగా, బుధవారంశ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బబ్లూ కుటుంబానికి రూ. 2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. వారం క్రితమే క్యాంపస్కు కొత్తగా వచ్చిన విద్యార్థులకు ఓరియంటేషన్నిర్వహించామని గుర్తు చేశారు. విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునేందుకు సజెషన్స్బ్యాక్సులు, మెయిన్ గేటు దగ్గర పేరెంట్స్ కోసం లాంజ్ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.