హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇటీవల పదో తరగతి పూర్తయిన స్టూడెంట్లకు లాంగ్ మెమోలు ఆగస్టులో అందనున్నాయి. దీనికి సంబంధిన ఏర్పాట్లను ప్రభుత్వ పరీక్షల విభాగం మొదలుపెట్టింది. 2020–21 విద్యాసంవత్సరంలో మొత్తం 5,21,647 మంది స్టూడెంట్లు ఫీజు కట్టగా, కరోనా తీవ్రత మేరకు వారందరినీ ప్రభుత్వం పాస్ చేసింది. నెల రోజుల కింద స్టూడెంట్లకు జీపీఏ పాయింట్లు కూడా అలాట్ చేశారు. ఈ ఏడాది బోర్డు ఎగ్జామ్స్నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో, హాల్ టికెట్లనూ స్టూడెంట్లకు అలాట్ చేయలేదు. దీంతో స్కూళ్లనుంచి హెడ్మాస్టర్లు ఎస్ఎస్సీ బోర్డుకు పంపించే వివరాల్లో చిన్నచిన్నతప్పులు కన్పిస్తున్నాయి. అయితే వీటిని సరిచేసుకునే అవకాశం ఎగ్జామినేషన్ బోర్డు ఇచ్చింది. ప్రస్తుతం ఇంటర్తో పాటు ఇతర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం స్టూడెంట్లకు ఇబ్బంది కాకుండా ఇంటర్నెట్ మెమోలను పొందేందుకు అవకాశముంది. ప్రింట్ తీసిన మెమోలపై ఆ స్కూల్ హెడ్మాస్టర్సంతకం చేసి ఇస్తే, దాని ఆధారంగా ఇంటర్, తదితర కోర్సుల్లో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉంది. అయితే ఈ మెమోల్లో స్టూడెంట్ల పేరు, పుట్టినతేదీ, తండ్రి పేరు, ఇతర అంశాల్లో ఏమైనా తప్పులుంటే వెంటనే గుర్తించి హెడ్మాస్టర్లకు తెలుపాలని అధికారులు స్టూడెంట్లు, పేరెంట్లకు సూచిస్తున్నారు. తద్వారా సరిచేసిన ఇంటర్నెట్ మెమోల ఆధారంగానే ఒరిజినల్ లాంగ్ మెమోలు రానున్నాయి. ఆగస్టు నెలలో స్టూడెండ్లకు ఒరిజినల్ మెమోలు అందిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
ఆగస్టులో పదో తరగతి లాంగ్ మెమోలు
- తెలంగాణం
- June 18, 2021
లేటెస్ట్
- చికెన్ తింటున్నారా జాగ్రత్త..కోళ్లలో కొత్త రకం వైరస్..ఏవియన్ ఫ్లూ వస్తోంది
- బీజేపీ ఆఖరి అస్త్రం.. రిజర్వేషన్లు రద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- అవునా నిజమా: మనల్ని కాదని.. కాంగ్రెస్ సర్కారు నడుస్తదా : తలసాని
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- హ్యాట్సాఫ్ ఇండియా : పాకిస్తానీ యువతికి.. భారతీయుడి గుండె..
- బీజేపీకి 405 సీట్లొస్తయ్.. ఢిల్లీకి ఏటీఎంగా తెలంగాణ : అమిత్ షా
- Guy Whittall: చిరుతపులి దాడి.. ప్రాణాలతో బయటపడిన జింబాబ్వే మాజీ క్రికెటర్
- V6 DIGITAL 25.04.2024 EVENING EDITION
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు
- Vishal: నన్ను అణచివేయాలని చూస్తున్నారు.. హీరో విశాల్ సంచలన కామెంట్స్
Most Read News
- చంద్రయాన్2 సక్సెస్ ఫుల్గా పనిచేస్తుంది..జపాన్ మూన్ ల్యాండర్ ఫొటోలు పంపింది
- కోహ్లీ కోసం..ఉప్పల్లో ఆర్సీబీతో సన్రైజర్స్ మ్యాచ్..అందరి ఫోకస్ విరాట్పైనే
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- మలుపులో మెట్రో రైలు సౌండ్స్..భరించలేకపోతున్నాం
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- ఆన్ లైన్ ట్రేడింగ్ వలలో మాజీ ఐఏఎస్.. ఏకంగా రూ. కోటి 87 లక్షలు పోగొట్టుకున్నారు
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- ఏప్రిల్ 26న ఐటీ కారిడార్లో ట్రాఫిక్ ఆంక్షలు
- Telangana Special : ఇప్ప పువ్వు పూసింది.. గూడెం మురిసింది.. తెల్లవారుజామునే అడవిలో సందడి
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి