
జపనీస్ ఎలక్ట్రిక్ ఆటో కంపెనీ టెర్రా మోటార్స్ భారత మార్కెట్లోకి 'క్యోరో ప్లస్' పేరుతో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర సుమారు రూ.3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. క్యోరో ప్లస్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
కొత్త మోడల్తో ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ మార్కెట్లో 5-–8 శాతం వాటాను దక్కించుకోవాలని టెర్రా లక్ష్యంగా పెట్టుకుంది. దేశమంతటా 100 డీలర్షిప్లను స్థాపించాలని, 2025 చివరి నాటికి నెలకు 5,000 యూనిట్లకు ఉత్పత్తిని పెంచాలని కూడా భావిస్తోంది.