పాక్​ నేవీ​ బేస్​పై టెర్రర్ దాడి

పాక్​ నేవీ​ బేస్​పై టెర్రర్ దాడి

పాక్​ నేవీ​ బేస్​పై టెర్రర్ దాడికరాచీ: పాకిస్తాన్​లో అతిపెద్ద నేవీ ఎయిర్​బేస్ లలో ఒకటైన పీఎన్​ఎస్​ సిద్ధిఖ్​పై సోమవారం రాత్రి టెర్రర్ దాడి జరిగింది. బలూచిస్తాన్​లో ఉన్న ఈ స్థావరంపై టెర్రరిస్టులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. అప్రమత్తమైన పాక్​ భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. దీంతో నలుగురు టెర్రరిస్టులు హతమయ్యారు. టెర్రరిస్టుల కాల్పుల్లో ఓ సైనికుడు చనిపోయాడు. ఎయిర్​ బేస్​ మూడు వైపులనుంచి టెర్రరిస్టులు  దాడికి దిగారని, భద్రతా సిబ్బంది అప్రమత్తమై వారిని అడ్డుకోగలిగారని మాక్రాన్​ కమిషనర్​ సయీద్​ అహ్మద్ ఉమ్రానీ తెలిపారు. ఈ ఘటనలో ఎయిర్​ బేస్​కుగానీ, విమానాలకుగానీ ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.  అయితే బలూచిస్తాన్​ ఫ్రాంటియర్​ కోర్​కు చెందిన 24 ఏండ్ల సైనికుడు మృతిచెందడం విచారకరమని వెల్లడించారు. కాగా, తుపాకీ శబ్దాలు, బాంబుల మోతలతో రాత్రంతా భయాందోళనల మధ్య గడిపామని స్థానికులు చెప్పారు.

  • దాడి చేసింది మేమే: బీఎల్ఏ

పాకిస్తాన్​ నేవీ ఎయిర్​ బేస్ సిద్ధిఖ్​పై దాడి చేసింది తామేనని బలూచిస్తాన్​ లిబరేషన్​ ఆర్మీ(బీఎల్​ఏ) వెల్లడించింది. ఈ దాడిలో తమ మజీద్​ బ్రిగేడ్​ పాల్గొన్నట్టు వెల్లడించింది. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.