హైదరాబాద్ లో ఉగ్ర పేలుళ్ల కుట్ర భగ్నం

హైదరాబాద్ లో ఉగ్ర పేలుళ్ల కుట్ర భగ్నం

ఉగ్రవాదుల భారీ కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేలుళ్లతో నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర పన్నిన ముగ్గురిని అరెస్టు చేశారు. అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను అరెస్టు చేసి.. వారి నుంచి నాలుగు హ్యాండ్ గ్రెనేడ్ లు, రూ.5.50 లక్షల నగదు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ జాహెద్ కు పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐతో లింకులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లో ఉగ్రదాడులు చేసేందుకు పాక్ నుంచే అతడికి నిధులు, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్ అందాయని వెల్లడించారు.

నగరంలో జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలతో పాటు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలు, దసరా ఉత్సవాలు జరిగే ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేయాలని జాహెద్ అండ్ టీం ప్లాన్ చేసిందని పోలీసులు చెప్పారు. మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లతో కలిసి అబ్దుల్ జాహెద్ గ్రెనేడ్ దాడులకు సంబంధించిన ప్లానింగ్స్ చేశాడని వివరించారు. అబ్దుల్ జాహెద్ తో పాటు ఏడుగురి పై సిట్ కేసు నమోదు చేసింది.