జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు.  ఈ దాడిలో 10మంది గాయపడ్డారు. ఈ ఘటన శనివారం పొద్దున 11 గంటలకు జమ్మూ కశ్మీర్ లోని అనంత్ నాగ్ లోని డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి దగ్గరలో జరిగింది. ప్రమాదంలో 12ఏళ్ల బాలిక, ట్రాఫిక్ కానిస్టేబుల్, ఒక జర్నలిస్ట్ కు  తీవ్రంగా గాయాలు అయినట్లు తెలిపారు పోలీసులు. ప్రస్తుతం వారు హాస్పిటల్ లో వైద్యం పొందుతున్నారు. గ్రెనేడ్ దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదులకోసం ఆర్మీ, పోలీసులు గాలిస్తున్నారు. ప్రజల్లో భయాలను కల్గించడానికే ఉగ్రవాదులు ఇలాంటి దాడులు చేస్తున్నట్లు తెలిపారు అధికారులు.