టెట్ ఫలితాల విడుదల ఆలస్యం 

టెట్ ఫలితాల విడుదల ఆలస్యం 

హైదరాబాద్: టెట్ ఫలితాలు విడుదల ఆలస్యం కానుంది.  రేపు సోమవారం  టెట్ ఫలితాలు విడుదల చేయడం లేదని టెట్ కన్వీనర్ రాధారెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. ఫలితాల విడుదల తేదీ ని త్వరలో ప్రకటిస్తామన్నారు టెట్ కన్వీనర్. టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయంలోనే జూన్27 న ఫలితాలు విడుదల చేస్తామని వెబ్ సైట్ లో పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడినా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు.