గ్రూప్ 2 అభ్యర్థులకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : నవీన్ వెల్లడి

గ్రూప్ 2  అభ్యర్థులకు 29 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : నవీన్ వెల్లడి
  • టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గ్రూప్-2 అభ్యర్థులకు ఈనెల 29 నుంచి వచ్చే నెల 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్  నిర్వహించనున్నారు. హైదరాబాద్  నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పాత క్యాంపస్​లో రెండు విడతల్లో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. ప్రతీరోజు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు వెరిఫికేషన్  జరుగుతుందని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్  నికోలస్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 

జనరల్  కేటగిరిలో 775 మంది, స్పోర్ట్స్  కేటగిరిలో ఎంపికైన ఇద్దరు అభ్యర్థుల షార్ట్‌‌లిస్ట్ ను  https://www.tspsc.gov.in వెబ్ సైట్​లో పెట్టామని వెల్లడించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్  కోసం జూన్ 11న రిజర్వ్ డేగా పెట్టామని చెప్పారు. ఈనెల 26న వెబ్ సైట్ లో షెడ్యూల్ పెడ్తామన్నారు. ఈనెల  27 నుంచి జూన్ 11 సాయంత్రం 5:00 వరకు టీజీపీఎస్సీ వెబ్‌‌సైట్‌‌లో వెబ్ ఆప్షన్స్ కు అవకాశం ఉంటుందని తెలిపారు.