
- సొంత వెహికల్స్, క్యాబ్లు వాడుతున్న ఐటీ ఎంప్లాయీస్
- పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు మళ్లాలని కంపెనీలతో సజ్జనార్ మీటింగ్స్
- తమ బస్సులను అద్దెకు తీసుకోవాలని సలహా
- ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని సూచన
హైదరాబాద్సిటీ, వెలుగు: పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విస్తరణలో భాగంగా ఐటీ కారిడార్లో బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు. ఎక్కువగా సొంత వాహనాలతో పాటు ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి ప్రైవేట్వెహికల్స్లో ఆఫీసులకు వెళ్తున్నారు. అలాగే ఐటీ కంపెనీలు భారీగా ప్రైవేట్వాహనాలను రెంట్కు తీసుకుని తమ ఎంప్లాయీస్కు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులను బస్సుల వైపు మళ్లించేలా ఆర్టీసీ ప్లాన్చేస్తున్నది. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
త్వరలో 275 ఎలక్ట్రిక్ బస్సులు
ఐటీ కారిడార్ లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తుండగా, త్వరలో మరో 275 బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు ఎండీ సజ్జనార్తెలిపారు. టీజీఎస్ఆర్టీసీ, అసోసియేటేడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్), తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్ మెంట్ కౌన్సిల్ సంయుక్తంగా ఐటీ కారిడార్ లో మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన కోసం కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా క్యాంపస్లో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్మాట్లాడుతూ.. ప్రైవేట్వాహనాల వినియోగం వల్ల ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవడమే దీనికి పరిష్కారమన్నారు. ఇది పర్యావరణాన్ని కూడా కాపాడుతుందన్నారు. పబ్లిక్ట్రాన్స్పోర్ట్వినియోగించుకునే ఉద్యోగులకు ప్రోత్సహకాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటీ కారిడార్ లో ఆర్టీసీ అందిస్తున్న సేవలను ఉన్నతాధికారులు వివరించారు. అసోచామ్ సదరన్ సెక్టార్ కో చైర్మన్, వర్చుసా వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ఎదుల, టీఎఫ్ఎంసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ మదాల, హెచ్ఆర్ హెడ్, టెక్ మహీంద్రా వినయ్ అగర్వాల్, ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్, రాజశేఖర్, సీటీఎం శ్రీదేవి, పాల్గొన్నారు.