ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా.. సమ్మక్క బంగారం బుకింగ్

ఆర్టీసీ వెబ్ సైట్ ద్వారా.. సమ్మక్క బంగారం బుకింగ్
  • జూబ్లీ బస్ స్టేషన్​లో  స్టిక్కర్లు, పోస్టర్లు ఆవిష్కరణ

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ జూబ్లీ బస్ స్టేషన్​లో మేడారం ప్రసాదం ఆన్​లైన్ బుకింగ్ స్టిక్కర్లు, పోస్టర్​ను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ సోమవారం ప్రారంభించారు. 

భక్తులు tgsrtclogistics.co.in వెబ్​సైట్ ద్వారా సులభంగా ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. డిప్యూటీ రీజినల్ మేనేజర్  శ్రీనివాస్, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మహ్మద్ బిన్ ఇషాక్ పాల్గొన్నారు.