- ఈ నెల 14 నుంచి 24 వరకు నడపనున్న ఆర్టీసీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలోని ప్రసిద్ధ ఖైరతాబాద్ మహా గణపతి, బాలాపూర్ గణేశ్ మండపాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులు ఈ నెల 14 నుంచి 24 వరకు జేబీఎస్, ఎంజీబీఎస్నుంచి అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ రూట్లో మండపాలకు..
ప్రత్యేక బస్సులు జేబీఎస్ నుంచి ప్రారంభమై ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమ్యాక్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, గాంధీ భవన్, అఫ్జల్గంజ్, సీబీఎస్/ఎంజీబీఎస్, విమెన్స్ కాలేజ్, జె.గార్డెన్, గవర్నమెంట్ ప్రెస్, ఐఎస్ సదన్, పిసల్బండ, మిధాని టౌన్ షిప్, బాలాపూర్ ఎక్స్ రోడ్, శివాజీ చౌక్ల మీదుగా బాలాపూర్ వరకు నడుస్తాయి.
జేబీఎస్ వద్ద ఉదయం 6 గంటలకు మొదటి సర్వీస్ ప్రారంభమై రాత్రి 9.55 గంటల వరకు ప్రతీ 40 నుంచి 50 నిమిషాలకో బస్సు అందుబాటులో ఉంటుంది. అలాగే, బాలాపూర్ గణేశ్మండపం నుంచి తిరుగు ప్రయాణ బస్సులు ఉదయం 7.55 గంటలకు ప్రారంభమై రాత్రి 11.50 గంటల వరకు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు.
