
హీరోయిన్గా టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన తమన్నా.. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్పై ఫోకస్ పెట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఓ మాస్ మసాలా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీలీల వంటి గ్లామరస్ తారలను సెలక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఇప్పుడు తమన్నాతో ఓ స్పెషల్ సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేస్తున్నారట.
అయితే, అప్పుడే తమన్నాపై కొత్త రూమర్ వినిపిస్తోంది. ఈ పాట కోసం ఏకంగా కోటిన్నర డిమాండ్ చేసి నిర్మాతలకు షాకిచ్చిందని టాక్. ఇందులో నిజం ఎంతో తెలియదు కానీ స్టార్ హీరోలతో స్పెషల్ సాంగ్స్ కి తమన్నా బెస్ట్ చాయిస్గా మారింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, యష్ వంటి హీరోలతో స్టెప్పులేసి అదరగొట్టింది. ఇప్పుడు బాలయ్యతో తమన్నా కాంబో అంటే ఫ్యాన్స్ ను ఏ రేంజ్లో ఊపేస్తుందో వేచి చూడాలి.