అదీ రాహుల్ ​అంటే.. ఎదుటోళ్లు చెప్పేది శ్రద్ధగా వింటరు: ప్రొ.​రమేశ్​ వేముగంటి

అదీ రాహుల్ ​అంటే.. ఎదుటోళ్లు చెప్పేది శ్రద్ధగా వింటరు: ప్రొ.​రమేశ్​ వేముగంటి
  • రాహుల్​తో మాట్లాడిన అనుభవాన్ని పంచుకున్న ఓయూ ప్రొఫెసర్

హైదరాబాద్, వెలుగు: రాహుల్​గాంధీ ప్రజలు చెప్పింది చాలా శ్రద్ధగా విని అర్థం చేసుకునే వ్యక్తి అని ఓయూ ప్రొఫెసర్​రమేశ్​వేముగంటి చెప్పారు. శంషాబాద్​ఎయిర్​పోర్ట్​వద్ద రాహుల్​గాంధీతో ముచ్చటించిన సందర్భాన్ని ఆయన గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘‘రాహుల్​గాంధీని ఎయిర్​పోర్టులో కలిశాను. ఆయన నా వృత్తి గురించి అడిగారు. నేను మేనేజ్ మెంట్​ టీచింగ్, ఐటీ మార్కెటింగ్, కార్పొరేట్​ట్రైనింగ్, బంగ్లాదేశ్​కన్సల్టెన్సీల గురించి వివరించాను. ఉత్పత్తి లేకపోవడం, యువతలో నైపుణ్యలేమి ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు అని ఆయనతో చెప్పాను. నేను చెప్పింది ఆయన చాలా శ్రద్ధగా విన్నారు.

చాలా బాగా అర్థం చేసుకున్నారు. ఎదుటి వారి పట్ల రాహుల్​ఎంతో గౌరవంగా ఉంటారు. ఆప్యాయంగా మాట్లాడుతారు. మరోసారి వచ్చినప్పుడు ఓ పారిశ్రామికవేత్త ఫ్యాక్టరీని సందర్శిస్తానని రాహుల్​ మాటిచ్చారు. సాఫ్ట్​వేర్​ఇండస్ట్రీ, ఏవియేషన్​ రంగంలోని ప్రతికూలతలు, ఇంజనీరింగ్​వంటి విషయాలపై వివిధ వర్గాల వారితో ఆయన మాట్లాడారు. రాహుల్​తో మాట్లాడాలని నేను ఆసక్తి చూపించినప్పుడు రేవంత్​లేచి నాకు సీటిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి పట్ల గౌరవం ప్రదర్శిస్తూ ఇతర నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి కోసం నేను తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్తున్నాను’’ అని రమేశ్​వేముగంటి రాహుల్​తో మాట్లాడిన తన అనుభవాన్ని పంచుకున్నారు.