అందుకే టీఆర్ఎస్ ప్లీనరీకి రాలేదు

అందుకే టీఆర్ఎస్ ప్లీనరీకి రాలేదు

టీఆర్ ఎస్ ప్లీనరీకి హాజరుకాకపోవడంపై మాజీ మంత్రి జూపల్లి కిష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలు, నాయకులపై పోలీసులతో, రాయలసీమకు చెందిన కొంతమంది రౌడీలతో దాడులు చేయిస్తున్నారంటూ ఆరోపించారు. సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులతో  దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయంపై జిల్లాకు చెందిన మంత్రికి, పోలీసు ఉన్నతాధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల దౌర్జన్యాలపై రాష్ట్ర డీజీపీకి చెప్పినా కూడా స్పందించడం లేదన్నారు. ఈ విషయంలో తీవ్రమైన మనోవేదనతో ఉన్న తాను టీఆర్ ఎస్ ప్లీనరీకి హాజరుకాలేదని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం.. 

 

కోవిడ్ ముప్పు ఇంకా పోలె

నేనడిగే 21 ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి