ఓయూ, వెలుగు: 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అడ్డు అంటున్న 50 శాతం సీలింగ్.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పడు ఎందుకు అడ్డు రాలేదో చెప్పాలని ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు డిమాండ్ చేశారు. బీసీ జనసభ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్, బీసీ జేఏసీ కో చైర్మన్ గుజ్జ సత్యంతో కలిసి ఓయూ ఆర్ట్స్కాలేజీ వద్ద రెండోరోజు బుధవారం చేపట్టిన విద్యార్థుల దీక్షకు మద్దతు తెలిపారు.
