
బాసర: సమస్యల సాధనకై బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల చేపట్టిన ఆందోళన 6వ రోజు కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. నిన్నమంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కేసీఆర్, కేటీఆర్ తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామంటూ విద్యార్థులు చెబుతున్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ ప్రయత్నించింది.
విద్యార్థులు ఆందోళన కంటిన్యూ చేస్తుండటంతో.. వారిని క్యాంపస్ నుంచి ఖాళీ చేయించేందకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే క్యాంపస్ లోని పీయూసీ1, పీయూసీ-2 విద్యార్థులు ఔట్ పాస్ తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. పేరెంట్స్ లేకుండా ఔట్ పాస్ లు ఎలా ఇస్తారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు, గార్డియన్ సమక్షంలోనే ఔట్ పాస్ లు జారీ చేయాలని విద్యా్ర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసరకు వచ్చే అన్ని రూట్లలో సెక్యూరిటీ టైట్ చేశారు. తమ ఆందోళనకు చెక్ పెట్టేందుకే సర్కార్ ఔట్ పాస్ లు జారీ చేస్తోందని విద్యార్థులు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు చెబుతున్నారు.