
- గడువు దాకా ఆగితే ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని పీకే రిపోర్ట్!
- గుజరాత్ ఎన్నికలతో వెళ్లాలంటే వచ్చే నెలలోనే అసెంబ్లీని రద్దు చేయాలి
- ఆ తర్వాత రద్దు చేస్తే వచ్చే ఏడాది
- మేలో కర్నాటకతో పాటు ఎలక్షన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం ముసురుకుంది. సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లతో ఈసారి కూడా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్ వరకు ప్రస్తుత టీఆర్ఎస్ సర్కారుకు గడువు ఉంది. 2018 ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ఇప్పటికే సాగుతున్నది. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలపై విరుచుకుపడ్డ కేసీఆర్.. ‘‘ఎన్నికల డేట్ డిసైడ్ చేస్తే... అసెంబ్లీ రద్దుకు నేను సిద్ధమే” అని కామెంట్లు చేయటం టీఆర్ఎస్ ముందస్తు మూడ్ను బయట పెట్టింది. షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలు జరగాలంటే అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేయాల్సి ఉంటుందనే చర్చలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
వచ్చే ఏడాది 2023 డిసెంబర్ 10వ తేదీ నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణీత ఐదేండ్ల గడువు ముగియనుంది. అప్పటి దాకా వెయిట్ చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే టైమ్
వచ్చే ఏడాది 2023 డిసెంబర్ 10వ తేదీ నాటికి టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణీత ఐదేండ్ల గడువు ముగియనుంది. అప్పటి దాకా వెయిట్ చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే.. అంతకు ముందే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత 6నెలల్లోపు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలనేది పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అదే టైమ్లో ఇతర రాష్ట్రాల ఎన్నికలు లేదా లోక్సభ ఎన్నికలు జరగాల్సి ఉంటే, రెండు, మూడు నెలలు అటుఇటుగా వాటితో పాటు ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, 2023 మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. గుజరాత్ లేదా కర్నాటక ఎన్నికలతోనే రాష్ట్రంలో ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేసుకున్నట్లు ఇతర పార్టీలు చెప్తున్నాయి. ఈ లెక్కన గుజరాత్తో పాటు ఎన్నికలకు వెళ్లాలంటే.. వచ్చే నెల రోజుల్లోనే (ఆగస్టు లోపు) అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తే.. 2023 మార్చి నుంచి మే మధ్యలో కర్నాటకతో పాటు ఎన్నికలు వచ్చే చాన్స్ ఉంటుంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. కర్నాటక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలకు వెళ్లేందుకు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో కర్నాటకలో బీజేపీ బలంగా ఉంది. అందుకే ఈ 2రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే.. బీజేపీ హైకమాండ్ ఫోకస్ కర్ణాటకపై ఎక్కువగా ఉంటుందని, తెలంగాణలో తక్కువగా ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో 2018 ఎన్నికలప్పుడు అవలంబించిన అడ్వాన్స్ ఎలక్షన్ స్ట్రాటజీ ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుందని అంచనాలు
వేసుకుంటున్నాయి.
పీకే వార్నింగ్ బెల్
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్నదని, అసెంబ్లీ ఎన్నికలు ఆలస్యమైతే టీఆర్ఎస్కు కష్టమని ప్రశాంత్ కిశోర్ ఇప్పటికే కేసీఆర్కు రిపోర్టులు అందించినట్లు తెలిసింది. గడిచిన ఆరు నెలలుగా సీఎం కేసీఆర్తో పాటు ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తున్నదని, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే.. అప్పటివరకు దీని ప్రభావం మరింత పెరుగుతుందని అలర్ట్ చేసినట్లు సమాచారం. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని టాక్ మొదలైంది. రాష్ట్రంలో లీడర్ల వలసలు జోరందుకున్నాయి. టీఆర్ఎస్ నుంచి జారుకుంటున్న నేతలు బీజేపీ, కాంగ్రెస్లో చేరుతున్నారు. జాతీయ పార్టీలు రెండూ ప్రత్యేకంగా జాయినింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. లీడర్ల వలసలు ఇంకా పెరిగి పోతే ఎన్నికల టైమ్లో మరింత పట్టు చేజారుతుందనే ప్రమాదాన్ని పసిగట్టిన టీఆర్ఎస్.. ముందస్తుకు సిద్ధపడుతున్నదనే అభిప్రాయాలున్నాయి.
ముందస్తుకు మేం సిద్ధం
ముందస్తుకు మేం రెడీ. కేసీఆర్ను గద్దె దింపేందుకు జనం కూడా సిద్ధంగా ఉన్నరు. ధరణిలో తప్పులను కరెక్షన్ చేయలేని కేసీఆర్ను ప్రజలు ఓటు అనే ఆయుధంతో కరెక్షన్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది. న్యాయం అడిగిన రైతులు, గిరిజనులను జైల్లో వేస్తున్నడు.
- బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్
4 రోజుల్లో రద్దు చేసి రా
కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డ అయితే నాలుగు రోజుల్లో ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో 90 లక్షల ఓట్లు తెచ్చుకొని కాంగ్రెస్ సర్కారును ఏర్పాటు చేస్తం. కేసీఆర్ పీడను వదిలించుకోవాలని ప్రజలు చూస్తున్నరు.
- పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
మోడీ డేట్ ప్రకటిస్తే సీఎం రెడీ
ముందస్తు ఎన్నికల తేదీని మోడీ ప్రకటిస్తే సీఎం కేసీఆర్ కూడా ఎలక్షన్స్ కు రెడీగా ఉన్నరు. ఎన్నికలకు టీఆర్ఎస్ ఎప్పుడూ భయపడదు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నం. ఈ విషయంలో ముందు ప్రధాని నిర్ణయం తీసుకోవాలె.
- మంత్రి గంగుల కమలాకర్
గడువు దాకా వెయిట్ చేస్తే ప్రమాదమనీ..!
2018లో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే భారీ మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కొన్ని నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు సగం సీట్లు కోల్పోయింది. మొత్తం 17 ఎంపీ సీట్లలో 4 చోట్ల బీజేపీ , 3 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. మరో సీటును ఎంఐఎం గెలుచుకుంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా రిపీటయ్యే ప్రమాదముందని టీఆర్ఎస్ తరఫున సర్వేలు చేస్తున్న ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ సీఎం కేసీఆర్ను అలర్ట్ చేసినట్లు తెలిసింది. షెడ్యూల్ ప్రకారం 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అప్పటి దాకా వెయిట్ చేస్తే.. ఎన్నికల నిర్వహణ ఈసీ చేతుల్లోకి వెళ్తుంది. లోక్సభ సభ్యుల పదవీ కాలం గడువు మే నెలతో ముగియనుంది. మూడు, నాలుగు నెలలు అసెంబ్లీ ఎన్నికలను లేట్ చేసి.. పార్లమెంట్తో పాటే జమిలి ఎన్నికల నిర్వహణకు సీఈసీ మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ రాజకీయాల ప్రభావం తెలంగాణలో ఓటింగ్పై ప్రభావం చూపుతుందని, ఫలితాలు తమకు రివర్స్ అవుతాయనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది.