సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్!

సమంతను చూసేందుకు రూ.2 లక్షల టికెట్.. ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్!

ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) క్రేజ్ మాములుగా లేదు. ఎక్కడికి వెళ్లినా ఆమెను చూసేందుకు ఎగబడుతున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గా ఆమె తన అమ్మతో అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. మాయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం ఆమె ఇటీవలే అమెరికా వెళ్లారు. అక్కడికి వెళ్లినప్పటి నుండి సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ తో టచ్ లోనే ఉంటున్నారామె. 

ఇక సమంత నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కాల్స్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబోలో వస్తున్న ఈ సినిమా  సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖుషి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికాలో ఓ ఈవెంట్ లో పాల్గొంది సమంత. ఇందుకోసం రూ.20 లక్షలు ఛార్జ్ చేసిందట ఈ బ్యూటీ. దీంతో ఈ ఈవెంట్ కు వెచ్చే ప్రేక్షకుల కోసం ఫ్రీ సిస్టం కాకుండా.. టికెట్స్ పెట్టారట నిర్వాహకులు.  ఆ రేట్స్ కూడా రూ.12 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పెట్టారట.

అంత రేటు పెట్టిన కూడా హాటు కేకులా అమ్ముడైపోయాయట ఆ టికెట్స్. ఇక సమంతను దగ్గరగా చూడే వీలుంటుందని రూ.2 లక్షల టికెట్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారట ఆడియన్స్. దీంతో అమెరికాలో సమంత క్రేజ్ నెక్స్ట్ లెవల్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.