ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు

ఉత్తరాఖండ్ లో బీజేపీ జోరు

ఉత్తరాఖండ్ లో బీజేపీకి ఎదురులేకుండా పోయింది. వార్ వన్ సైడ్ గా మారిపోయింది. ఎన్నికలు ఏవైనా విజయం మాత్రం బీజేపీదే అన్నట్టుగా మారిపోయింది. అందుకే అసెంబ్లీ ఫలితాల్లో కూడా కమలం పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది.  మరోసారి అధికారం నిలబెట్టుకోనున్నారు కమలనాథులు. ఫలితాల్లో విపక్షాలకు అందనంత దూరంలో బీజేపీ నిలిచింది.రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలు ఉండగా..ఇప్పటికే మెజార్టీ మార్క్ ను దాటేసింది. దాదాపు 46 స్థానాల్లో  కమలం పార్టీ దూసుకుపోతోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తే హాఫ్ సెంచరీ దాటే ఛాన్స్ ఉంది.ఇక  కాంగ్రెస్ కేవలం 22 స్థానాల్లో మాత్రమే లీడ్ లో కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. ఇతరులు మాత్రం రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.ఉత్తరాఖండ్ లో మరోసారి అధికారం దక్కించుకోనుండటంతో కమలనాథుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.