ఆమనగల్లు, వెలుగు: వేడి నూనె ఒంటిపై పడి తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్ఐ బలరాం కథనం ప్రకారం..నాగర్కర్నూల్జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామానికి చెందిన అర్జున్ జాతరల్లో ఫుడ్స్టాల్స్ఏర్పాటు చేస్తుంటాడు. ఇందులో భాగంగా అక్కడే వంటకాలు తయారు చేసి అమ్ముతుంటాడు.
రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా దుకాణం ఏర్పాటు చేయగా ఇతడి కొడుకు జయదేవ్(3) కూడా వెంట ఉన్నాడు. శనివారం రాత్రి పొయ్యిపై ఉన్న వేడి నూనె మూకుడుకు జయదేవ్ కాలు తగలడంతో అతడిపై కాగుతున్న నూనె పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.