కాగుతున్న వేడి నూనె పడి బాలుడి కన్నుమూత

కాగుతున్న వేడి నూనె పడి బాలుడి కన్నుమూత

 ఆమనగల్లు, వెలుగు: వేడి నూనె ఒంటిపై పడి తీవ్రంగా గాయపడిన ఓ బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎస్ఐ బలరాం కథనం ప్రకారం..నాగర్​కర్నూల్​జిల్లా వెల్దండ మండలం బండోనిపల్లి గ్రామానికి చెందిన అర్జున్ జాతరల్లో ఫుడ్​స్టాల్స్​ఏర్పాటు చేస్తుంటాడు. ఇందులో భాగంగా అక్కడే వంటకాలు తయారు చేసి అమ్ముతుంటాడు. 

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో జరుగుతున్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో కూడా దుకాణం ఏర్పాటు చేయగా ఇతడి కొడుకు జయదేవ్​(3) కూడా వెంట ఉన్నాడు. శనివారం రాత్రి పొయ్యిపై ఉన్న వేడి నూనె మూకుడుకు జయదేవ్ కాలు తగలడంతో అతడిపై కాగుతున్న నూనె పడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని గాంధీ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.