విపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ

విపక్షాలతో ఇవాళ కేంద్రం అఖిలపక్ష భేటీ

ఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. బడ్జెట్‌ సమావేశాల దృష్ట్యా సజావుగా సభలు సాగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరనున్నట్లు తెలుస్తోంది. 

2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌ ఇదేకానుంది. అందుకే కేంద్రం విపక్షాలకు విజ్ఞప్తి చేయనుంది. మరోవైపు.. రేపు పార్లమెంట్‌ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలుకానున్నాయి. ప్రసంగం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.