బ్రిడ్జి పై నుంచి రైలు పట్టాలపై పడిన కారు..

బ్రిడ్జి పై నుంచి రైలు పట్టాలపై పడిన కారు..

మహారాష్ట్రలోని నాగ్ పూర్ జిల్లాలో ఉన్న బోర్ఖెడి ఓవర్ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఓ కారు రైల్వే ట్రాక్ పై పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను బుట్టిబోరిలోని మాయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన జూలై 2న ఉదయం 7.30గంటల ప్రాంతంలో జరిగినట్టు తెలుస్తోంది.

కారులో ప్రయాణిస్తోన్న వ్యక్తులు హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ కు వెళ్లుతున్నారు. కారు ఓవర్ బ్రిడ్జిపై నుంచి పడిపోవడంతో కారు మొత్తం ధ్వంసమైపోయింది. కాగా ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.