- సిగ్నల్ దగ్గర ఆగిన బైక్ను ఢీ కొట్టిన కారు
- యువతి మృతి.. యువకుడికి తీవ్రగాయాలు
- వీరికి నెల కిందట ఎంగేజ్మెంట్.. త్వరలో పెండ్లి
మాదాపూర్, వెలుగు: త్వరలో పెండ్లి చేసుకోవాల్సిన జంట బైక్పై వెళ్తుండగా కారు ఢీ కొట్టడడంతో యువతి చనిపోగా, యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మాదాపూర్లో జరిగింది. నేరేడ్మెట్కు చెందిన టి. అజయ్(23), సైనిక్పురికి చెందిన జెన్నిఫర్మరియా డిక్రూజ్(23) ఫ్రెండ్స్. వేర్వేరు కంపెనీల్లో ఐటీ ఎంప్లాయీస్.వీరికి నెల రోజుల కిందట పెద్దలు ఎంగేజ్మెంట్ చేశారు. ఆదివారం ఉదయం7.10 గంటల సమయంలో ఇద్దరూ కలిసి రాయల్ఎన్ఫీల్డ్బైక్(టీఎస్08హెచ్ఏ8739)పై కొత్తగూడ నుంచి సైబర్టవర్స్ వైపు వెళ్తూ గూగుల్ ఆఫీస్ వద్ద సిగ్నల్పడగా ఆగారు. కొత్తగూడ నుంచి స్పీడ్గా వచ్చిన కారు(టీఎస్08ఎఫ్యూ5618) బైక్ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్వెనకాల కూర్చున్న జెన్నిఫర్తలకు తీవ్రగాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బైక్ డ్రైవ్చేసిన అజయ్ రెండు కాళ్లు, వెన్నెముకకు బలమైన గాయాలై ట్రీట్మెంట్తీసుకుంటున్నాడు. మృతురాలి తండ్రి జాన్ సిరిల్ డిక్రూజ్కంప్లయింట్చేయగా కేసు ఫైల్ చేశామని మాదాపూర్ ఇన్స్పెక్టర్రవీంద్ర ప్రసాద్ తెలిపారు. కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడని చెప్పారు.