అదుపుతప్పి ట్రక్కును  ఢీ కొట్టిన కారు

అదుపుతప్పి ట్రక్కును  ఢీ కొట్టిన కారు
  • ఢిల్లీలో ఇద్దరు మృతి.. 
  • ఐసీయూలో మరో ముగ్గురు

న్యూఢిల్లీ: ట్రక్కును కారు ఢీ కొట్టిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఢిల్లీ కంటోన్మెంట్‌‌‌‌ ఏరియాలో శనివారం తెల్లవారుజామున యాక్సిడెంట్ జరిగింది. ప్రమాద తీవ్రతకు లగ్జరీ కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్స్‌‌‌‌ ఓపెన్ అయినప్పటికీ కారు కేబిన్‌‌‌‌ మొత్తం దెబ్బతింది. సౌత్‌‌‌‌ వెస్ట్‌‌‌‌ ఢిల్లీకి చెందిన అయిదుగురు యువకులు ఫరీదాబాద్‌‌‌‌లో ఒక పెండ్లి వేడుకకు హాజరై తిరిగివస్తున్నారు. ధౌలా కున్, పాలం మధ్య ఉన్న ఫ్లై ఓవర్‌‌‌‌‌‌‌‌పైకి వచ్చిన తరువాత కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదం గురించిన సమాచారం తెలిసిన వెంటనే స్పాట్‌‌‌‌కు వెళ్లి కారులో ఉన్న వాళ్లను హాస్పిటల్‌‌‌‌కు తరలించామని పోలీసులు తెలిపారు. హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ తీసుకుంటూ వినోద్, కృష్ణ సోలంకి మరణించారని, నితిన్, జితేందర్, కరణ్ భరద్వాజ్‌‌‌‌ పరిస్థితి క్రిటికల్‌‌‌‌గా ఉందన్నారు. ముగ్గురూ ఐసీయూలో ఉన్నారని చెప్పారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. యాక్సిడెంట్ తర్వాత పారిపోయిన ట్రక్కు డ్రైవర్‌‌‌‌‌‌‌‌ కోసం గాలిస్తున్నామని, మరింత సమాచారం కోసం ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీలను 
పరిశీలిస్తున్నామని అన్నారు.